PPM: విధుల నుంచి తొలగించిన సాలూరు మండలం ఖరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. గిరిజన శాఖ మంత్రి గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.