AKP: మాడుగుల మండల కేంద్రంలోని పీ-4 కార్యాలయంలో వెలుగు వీవోఏలకు బుధవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. పనులు వేగవంతానికి మొబైల్ ఫోన్లు దోహదపడతాయన్నారు. వీవోఏలు అంకితభావంతో పనిచేసే డ్వాక్రా మహిళల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వారికి బ్యాంకుల ద్వారా సకాలంలో రుణాలు మంజూరు అయ్యేలా బాధ్యతలు తీసుకోవాలన్నారు.