AP: కృష్ణా జిల్లాలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తల్లి ఆచూకీ గుర్తిస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.