SRD: సిర్గాపూర్లో వందేళ్ల చరిత్ర గల మంచినీళ్ల బావిని మూసివేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామానికి చెందిన జయరాం అనే వ్యక్తి బావిని మూసి వేసి కబ్జాకు యత్నిస్తున్నాడని గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి నవీన్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి తాగునీటి బావిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.