SRD: శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే అందజేయనున్నట్లు సంగారెడ్డి ఆర్ఎం విజయ భాస్కర్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా కేవలం రూ.151 చెల్లించి తలంబ్రాలు పొందవచ్చని పేర్కొన్నారు. భద్రాద్రి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఈ సేవను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.