BDK: అశ్వారావుపేట ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకులంలో నిర్వహించిన ‘మాక్ పార్లమెంట్’ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ సంగీత రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థినులకు పార్లమెంటరీ విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్పీకర్గా తాజాని, ప్రధానిగా ఎం.డి. ఆయేషా నిమ్రా పాత్రలను సమర్థంగా పోషిస్తూ సభా నిర్వహణను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.