SKLM: జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎస్ .అన్నా జీ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా బిల్లు చాటున రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా డీలిమిటేషన్ అమలు చేయాలని కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లు విఫలమవడం కేంద్రానికి చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.