ASR: ఉపాధి కూలీలకు ఫేస్ హాజరు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జే.భగత్ రాం డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం అరకు మండలం పద్మాపురం పంచాయితీ దుమ్ముగూడ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. ఫేస్ హాజరు వల్ల గిరిజన ప్రాంతంలో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల గిరిజనులు సక్రమంగా పని చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.