VKB: జీవితంలో ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని జడ్పీ సీఈవో సుధీర్ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ హోమియోపతి డేను ఆయుష్ వారి ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.