SRD: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిన్నారం ఎస్సై హనుమంత హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాలి అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు.