AP: ప.గో(D) నల్లజర్ల మం. అనంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపల్లి టోల్గేట్ సమీపంలోని సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను గోపాలరావు పేట ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.