HYD: కాలనీ రహదారుల కబ్జాలపై హైడ్రా ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డెడ్ ఎండ్ రోడ్లను మూసివేయడం, కాలువలను అడ్డుకోవడం వంటి సమస్యలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల రహదారులు, పార్కులు, కాలువల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తమైంది. మొత్తం 58 ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంబంధిత అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.