GDWL: మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ గద్వాల్ ఇంఛార్జ్ సరిత అన్నారు. ఇవాళ పూలే జయంతి సందర్భంగా శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1848లో పుణేలో సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించారని గుర్తుచేశారు. పూలే స్ఫూర్తితో మహిళలు విద్యావంతులై ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.