JGL: మేడిపల్లి మండలం మన్నెగూడెంలో కుట్టు శిక్షణ కేంద్రంను సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు కుట్టుపనిలో మెళకువలు నేర్పించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.