NZB: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, నిజామాబాద్ నేత బస్వా లక్ష్మీనరసయ్య మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా వేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు ఎందుకు వేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై మార్చి 3వ తేదీన రైతు దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.