KMM: చింతకాని మండలం తిమ్మినేనిపాలెం మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూ నాగులవంచ వద్ద మరొక వాహనాన్ని ఓవర్టేక్ చెయ్యబోయి ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్న ఇంటర్ విద్యార్థి శ్రీరాం (17) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీరాం బోనకల్ మండల పరిధిలోని గార్లపాడు వాసిగా గుర్తించారు.