PDPL: గోదావరిఖని డిపో నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, కాంచీపురం, జోగులాంబ దర్శనాలు కల్పిస్తారు. 15న తిరుగు ప్రయాణం. టికెట్ ధర రూ.10,000. వివరాలకు 7382847596ను సంప్రదించాలని సూచించారు.