MDK: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చేగుంటలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చేగుంట మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అన్నారు.