పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుంది అన్నారు.