W.G: నిబంధనలు పాటించడం బాధ్యత మాత్రమే కాదని, అది వాహనదారుల భద్రత కూడా అని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, అతివేగం, మొబైల్ డ్రైవింగ్, నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని ఎస్సై తెలిపారు.