TPT: తిరుపతి గొల్లవనిగుంటలో రూ.10.10 కోట్లతో నిర్మించిన ఆధునిక క్రీడా స్టేడియాన్ని రేపు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. CSR-PPP మోడల్లో దీనిని అభివృద్ధి చేసినట్లు శాప్ ఛైర్మన్ తెలిపారు. చంద్రగిరిలో ఇండోర్ హాల్, తిరుపతిలో బాక్సింగ్ రింగ్తో పాటు కరణం మల్లేశ్వరి పేరుతో అకాడమీ ఏర్పాటు చేసి జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.