పల్నాడు: శావల్యాపురం మండలం పొట్లూరులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం తిరుణాల వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్ ప్రభలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.