ఎన్టీఆర్: ఇంట్లో పని చేసే పనిమనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు సేకరించడం అత్యంత అవసరమని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. ఇటీవల నగరంలో జరుగుతున్న చోరీలు, మోసాల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్లు తెలిపారు. పనిమనుషులను పని కోసం తీసుకునే ముందు వారి ఆధార్, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు.