JGL: కరీంనగర్ నుంచి బీజేపీ నూతన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో పాదయాత్రగా బయలుదేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా ఆలస్యంగా కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకే ఆలయానికి చేరుకోవాల్సిన ఆయన రాత్రి 10 దాటాక ఆలయానికి చేరుకోవడంతో, అప్పటికే ఆలయం ముసివేశారు. ప్రధాన ద్వారం ముందే పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.