GDWL: 70 మంది బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ పక్షపాత వైఖరికి నిదర్శనం అని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం గద్వాల ఎంఆర్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు.