MBNR: పట్టణ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.