WGL: రాయపర్తి మండలం AK తండా గ్రామానికి చెందిన గుగులోత్ మహేశ్వరీ (చిట్టి) ఇటీవల హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం వారి నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలుజల్లి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్యకు కారణమైన నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.