MDK: పార్టీలకు అతీతంగా రామాయంపేట అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య సూచించారు. బుధవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు.