MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను బట్టబయలు చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీపీఐ, బీఆర్ఎస్ మధ్య చిచ్చుపెట్టి, అడ్డదారిలో రాజకీయ లబ్ధి పొందాలని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూస్తున్నారని విమర్శించారు.