BDK: పార్లమెంట్లో ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మండిపడ్డారు. వందలాది మంది అమరవీరుల ఆత్మ బలిదానాలు, తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వాన అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని స్పష్టం చేశారు. ఎంపీ బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.