BDK: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంబపాటి శ్రీనివాస్ తనయుడు కంబపాటి జశ్వంత్ ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.