JN: ప్రజలు తమ హక్కులను సాధించుకోవడానికి అధికారులను నిలదీయాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ MLA తాటికొండ రాజయ్య కోరారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి గ్రామసభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ సభలలో BRS కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు.