SDPT: బెజ్జంకి మండలంలోని రామసాగరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మంజూరైన రూ.10 లక్షలతో ఫీడర్ ఛానల్ నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఇంగాల నాగలక్ష్మి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కాలువతో సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగి రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వీరేశం, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.