NLG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చిట్యాల – శ్రీరామ్ నగర్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్-30 ని తాత్కాలికంగా మూసివేశారు. కి.మీ. 53/5-6 వద్ద ఉన్న ఈ గేటును ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఈరోజు నుంచి బుధవారం సా. వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాలను చూసుకోవాలని సూచించారు.