ADB: కంది పంటతోపాటు కోతకు వచ్చిన శనగ పంటను మద్దతు ధరతో త్వరగా కొనుగోలు చేయాలని జైనథ్ మండల రైతులు కోరారు. సోమవారం MLA పాయల్ శంకర్ను కలిసి యాసంగి పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డులో జొన్న, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.