JGL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 16న పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డిఫంక్షన్ హాల్లో మండల స్థాయి ప్రత్యేక సమావేశం ఉన్నట్లు ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరుకావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివరిస్తారని పేర్కొన్నారు.