NRML: జిల్లా పెంబి బ్లాక్ మరో అరుదైన గౌరవం సాధించింది. మార్చి 9న విశాఖలో జరిగే నీతి ఆయోగ్ రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సుకు ఇది ఎంపికైందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. తెలంగాణ నుండి నిర్మల్, గద్వాల జిల్లాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. విద్య, ఆరోగ్యం (అమ్మ రక్షిత, బాలశక్తి), వ్యవసాయ రంగాల్లో పెంబి సాధించిన విజయాలను ఈ సదస్సులో వివరించనున్నారు.