HYD: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నెలరోజుల వ్యవధిలో యాదమ్మ, మంగతాయారు అనే ఇద్దరు వృద్ధులను కిరాతకంగా హతమార్చిన నిందితుడు వాసును జూబ్లీహిల్స్ పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బెట్టింగులకు అలవాటు పడిన వాసు వీరిద్దరిని కిరాతకంగా హత్య చేసి నగర శివారులలో పడేశాడు. ఈ ఘటనలో నిందితుడు నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు విచారిస్తున్నారు.