ADB: శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలకు ప్రజలు సహకరించాలని గాదిగూడ ఎస్సై రమ్య అన్నారు. ఆదివారం సర్పంచులతో సమావేశం నిర్వహించారు. గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలకు ప్రజలు బానిస కావద్దన్నారు. ఎవరైన గంజాయి సాగు చేసినా, విక్రయించినా చట్టరీత్య చర్యలు ఉంటాయన్నారు. అత్యవసరాలకు డయల్ 100ను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.