RR: సాహెబ్ నగర్లో జలమండలి అధికారులను సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దుర్వాసన వెదజల్లుతుందని సమస్యలను వారికి విన్నవించారు. వెంటనే వాటిని శుభ్రపరచాలని, నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.