VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సాధారణ తనిఖీలలో భాగంగా ఆదివారం బొబ్బిలి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన ఆహ్వానం మేరకు బొబ్బిలి కోటకు వచ్చి దర్బార్ మహల్ని సందర్శించారు. ఎమ్మెల్యే దగ్గరుండి బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను, చిత్రపటాలను చూపించి వాటి గురించి వివరించారు. అనంతరం బొబ్బిలి వీణను బహూకరించి సత్కారించారు.