MHBD: అప్రమత్తతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం, పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పువన్నారు.