MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో ఓ నూతన ఇంటి కిటికీలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గమనించిన ఇంటి సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారి కిష్టయ్య బృందం అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను బంధించారు. పట్టుకున్న పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.