HYD: సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి పథకం అర్హులైన వారికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.