NRML: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సాగునీటి సరఫరాపై కూడా సమీక్షించారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, రైతులకు అవసరమైన సాగునీరు అందుబాటులో ఉందని కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.