HYD: నగరంలో చెరువుల అభివృద్ధిని వేగం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ రామచంద్రపురంలోని గంగారం చెరువుతోపాటు ఈర్ల చెరువును పరిశీలించారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. మురుగు కాలువలన్నింటిని అనుసంధానం చేసి ఎస్టీపీ వద్ద ట్రీట్ అయిన తర్వాతే చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు.