నిర్మల్ జిల్లా DCC కార్యదర్శిగా నియమితులైన ఏంబడి రాకేష్ ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ను ఉట్నూర్ మండలంలోని MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ప్రతిమను అందజేశారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు.