WNP: అమరచింత పెద్ద చెరువు ఆధునీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికే శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ నాయకులు ప్రారంభం చేయడం మంత్రిని అవమానించడమేనని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ గురువారం విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో రూ.314 లక్షల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయని, దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు.