RR: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నిన్న చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్పర్సన్, పాలకవర్గ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య విజ్ఞప్తి మేరకు ఈ నిధులు కేటాయిస్తున్నామన్నారు. వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.