SDPT: చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై రెండు రోజుల పాటు సాగిన ‘సీఎం కప్’ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య పాల్గొని విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.